మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు

ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.పది మంది రౌడీలను వెంటేసుకొని తిరగడం చేతగాక పాత తరం నాయకుడిలా మిగిలిపోయానన్నారు.

 Sensational Comments Of Mylavaram Mla Vasantha Krishna Prasad-TeluguStop.com

తాను పుట్టినప్పటి నుంచి తన తండ్రి రాజకీయాల్లో ఉన్నారన్న ఆయన 55 ఏళ్లుగా తమ కుటుంబం రాజకీయాల్లో ఉందని చెప్పారు.అప్పటి రాజకీయాలతో పోలిస్తే ఇప్పటి రాజకీయాలు మారిపోయాయని తెలిపారు.

రౌడీలను వెంటేసుకొని వారిలా తిరిగితేనే ముందుకు వెళ్లే పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు.ఒక్కోసారి రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే ఎందుకయ్యానా అని బాధపడుతున్నట్లు వెల్లడించారు.

మూడేన్నరేళ్లలో ఎవరిపై అక్రమ కేసులు బనాయించలేదని, ఎవరికీ సంక్షేమ పథకాలు ఆపలేదని చెప్పారు.అక్రమ కేసుల విషయంలో కొందరు నేతలకు తనపై అసంతృప్తి ఉందని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube