పలు అంశాలపై తీర్మానం చేసిన గ్రామపంచాయతీ పాలకవర్గం..

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla ) ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామపంచాయతీలో గ్రామ పాలకవర్గ సభ్యులతో కలసి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో సర్పంచ్ వెంకట్ రెడ్డి( Sarpanch Venkat Reddy ) మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్న సమస్యలపై ప్రస్తావించారు.

 Sarpanch Venkat Reddy Inspects Village Problems,sarpanch Venkar Reddy ,rajanna S-TeluguStop.com

ప్రతిరోజు ఫాగింగ్ మిషన్ ద్వారా ఫాగింగ్ చేయాలని, గ్రామంలో నీటి కొరత లేకుండా చూడాలని, విద్యుత్ దీపాలను అమర్చాలని, కిషన్ దాస్ పేట నుండి కోరుట్ల పేట వెళ్లే రహదారిలో ఉన్నటువంటి పెద్ద ఒర్రె బ్రిడ్జి భారీ వాహనాలు వెళ్తే కూలిపోయే దశలో ఉన్న నేపథ్యంలో బ్రిడ్జి మరమ్మత్తుల కొరకై పలు అంశాలపై తీర్మానం చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్, ఎంపీటీసీలు పందిర్ల నాగరాణి, ఎలగందుల అనసూయ,వార్డు సభ్యులు, పంచాయతీ సెక్రెటరీ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube