విద్యుత్ చార్జీలు పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు ... ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పాలనపై ఓర్వలేకపోతున్న చంద్రబాబు అండ్ కో బృందనికి చేయడానికి సరైన కారణాలు లేకపోవడంతో తప్పుడు ప్రచారాలకు పాల్పడుతు ప్రజలను మభ్యపెడుతున్నారని,ఇది వారి రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం అని ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను గారు అన్నారు.

రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచక ముందే పెంచినట్టుగా ప్రజలను మభ్యపెడుతూ నిరసనలు చేయడంపై సోమవారం నాడు ప్రభుత్వవిప్, శాసనసభ్యులు సామినేని ఉదయభాను గారు మీడియాతో మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి గారి పాలనలో తప్పులేమి కనిపించని ప్రతిపక్ష నాయకులకు అసత్య ప్రచారాలను సత్యాలుగా చూపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న వారికి మతి బ్రమిచింది అని అన్నారు.

గత చంద్రబాబు పాలనలో బషీరాబాగ్ వద్ద విద్యుత్ చార్జీలు పెంచిన సంఘటనకు సంబంధించి ఉద్యమం చేస్తున్న ప్రజలపై నిరంకుశంగా ప్రవర్తించి మహిళలని చూడకుండా రోడ్లపై ఈడ్చుకుంటూ వెళ్లి, దారుణంగా దాడులు చేశారని అన్నారు.ఈ సంగతి మరిచిపోయిన తెలుగుదేశం పార్టీ నేతలు గురిగింజ సామెత వలె ఉద్యమాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న వారికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ధ్వజమెత్తారు.

ఆ విషయంలో భయపడుతున్న ఎన్టీఆర్.. అలా చేస్తే రిస్క్ చేసినట్టే అని ఫీలవుతున్నారా?

తాజా వార్తలు