బ్యాగ్రౌండ్ లేకుండా స్టార్ హీరోయిన్ గా ఎదిగి విజయాలను సొంతం చేసుకుంటున్న సెలబ్రిటీలలో సమంత కూడా ఒకరు.సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సమంత భవిష్యత్తు ప్రాజెక్ట్ లపై కూడా భారీస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.
యశోద, శాకుంతలం లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ లు కాగా ఈ సినిమాలతో తప్పనిసరిగా సక్సెస్ ను సొంతం చేసుకుంటానని సమంత భావిస్తున్నారు.
వరుస విజయాలతో సౌత్ ప్రేక్షకులకు మరింత చేరువవుతున్న సమంత ట్రోల్స్ గురించి, నెగిటివ్ కామెంట్ల గురించి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సమంత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుండగా ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చూడాల్సి ఉంది.బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా సమంతకు ఆఫర్లు వస్తున్నా వచ్చిన ప్రతి ఆఫర్ కు ఓకే చెప్పకుండా సమంత ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూకు హాజరైన సమంత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం తనకు చాలా ఇష్టమని తెలిపారు.మాటల్లో చెప్పలేని ఎన్నో విషయాలను ఫోటో ద్వారా చెప్పడం సాధ్యమవుతుందని సమంత వెల్లడించారు.సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు షేర్ చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులతో నేరుగా కనెక్ట్ కావడం సాధ్యమవుతుందని సమంత కామెంట్లు చేశారు.అయితే ట్రోల్స్, నెగిటివ్ కామెంట్ల వల్ల మొదట్లో తాను బాధ పడేదానినని సమంత చెప్పుకొచ్చారు.
ఈ బాధ వల్ల రాత్రి సమయంలో నిద్ర లేకుండా గడిపిన రోజులు కూడా ఉన్నాయని సమంత చెప్పుకొచ్చారు.ఇప్పుడు ట్రోల్స్ ను పట్టించుకోనని అయితే తాను సద్విమర్శలను మాత్రం కచ్చితంగా స్వీకరిస్తానని సమంత కామెంట్లు చేశారు.
సమంత చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.చైతన్యతో విడిపోయిన తర్వాత సమంతను ఎక్కువమంది ట్రోల్ చేస్తున్నారు.