శాకుంతలం ట్రైలర్ ఈవెంట్ లో సినీ నటి సమంత భావోద్వేగానికి గురైయ్యారు.చాలా కాలం తర్వాత సమంత మీడియా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
అనారోగ్య కారణాలతో ఇటీవల సినిమా ప్రమోషన్స్ కు సామ్ హాజరుకావడం లేదు.మయెసైటిస్ బారిన పడిన సమంత కోలుకుని తాజాగా శాకుంతలం మూవీ ప్రమోషన్ కు హాజరైయ్యారు.
సమంత ప్రధాన పాత్రగా, గుణశేఖర్ దర్శక నిర్మాతగా శాకుంతలం మూవీ నిర్మితమైన విషయం తెలిసిందే.ఇప్పటికే శకుంతల – దుష్యంతులుగా నటిస్తున్న సమంత -దేవ్ మోహన్ లపై డిజైన్ చేసిన పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
కాగా ఫిబ్రవరి 17వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.







