సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటే వారి చుట్టూ ఎన్నో రకాల కంపెనీలు తమ ప్రాజెక్టులను ప్రమోట్ చేయాలి అంటూ వారి వెంట పడటమే కాకుండా ఒక్కో ప్రమోషన్ కి భారీగా రెమ్యూనరేషన్ కూడా అందిస్తూ ఉంటారు.ఇలా కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకుంటూ పలు బ్రాండ్లకు హీరోలు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తూ ప్రమోట్ చేస్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ( Amitabh Bachchan ) ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.ఈయన ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు పలు రకాల బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.
ఇలా హీరోలు ప్రమోట్ చేసే కొన్ని బ్రాండ్లు ద్వారా ప్రజలు భారీగా మోసపోతున్నటువంటి సందర్భాలు తలెత్తుతున్నాయి.ఈ క్రమంలోనే ఈ విషయాన్ని ఉద్దేశిస్తూ ఐపీఎస్ అధికారి టిఎస్ఆర్టిసి ఎండి సజ్జనార్( Sajjanar ) అమితాబ్ తో పాటు పలువురు హీరోలకు ఒక చిన్న విజ్ఞప్తి చేశారు.కొన్ని కంపెనీలు జనాలను పెద్ద ఎత్తున మోసం చేస్తున్నాయని అలాంటి కంపెనీలకు ప్రచారం చేయొద్దు అంటూ ఈయన వేడుకున్నారు.మీకున్నటువంటి ఈ స్టార్ డమ్ ని కేవలం మంచి కోసం మాత్రమే ఉపయోగించండి మీకున్నటువంటి పేరు ప్రతిష్టలను సమాజానికి చెడు చేసే కంపెనీలపై పెట్టకండి అంటూ ఈయన సూచించారు.
ఆమ్వే లాంటి కంపెనీలు దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీస్తున్నాయి.ఇలాంటి కంపెనీలకు ప్రచారం చేయడం వల్ల ప్రజలు, వ్యవస్థ మరింత నష్టపోయే ప్రమాదం ఉంది’ అని సజ్జనార్ ట్వీట్ చేశాడు.అబితాబ్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న మల్టీ లెవల్ మార్కెటింగ్ ప్రమోటింగ్ కంపెనీ ఆమ్వే( Amway ) పై 2022లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసిన విషయం మనకు తెలిసిందే.ఇలా గొలుసు కట్టు వ్యాపారం పేరుతో మోసానికి పాల్పడుతున్నారని గుర్తించిన ఈడీ ఆమ్వే ఆస్తులను జప్తు చేసింది.
ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉండగా సజ్జనర్ ఇలాంటి కంపెనీలకు ప్రచారం చేయొద్దండి అంటూ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.