సాగర్ వివాదం..ఏపీ పోలీసులపై కేసు..!

నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటి వివాదం మరింత ముదురుతోంది.ఈ క్రమంలో ఏపీ పోలీసులపై తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ బలగాలు కేసు నమోదు చేశాయి.

 Sagar Dispute..case Against Ap Police..!-TeluguStop.com

ఈ మేరకు నాగార్జున సాగర్ విజయపురి టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.ఇందులో ఏపీ పోలీస్ ఫోర్స్ ను ఏ1గా తెలంగాణ పోలీసులు చేర్చారు.

తెలంగాణ భూభాగంలోకి దౌర్జన్యంగా చొచ్చుకువచ్చారని తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ ఫోర్స్ ఫిర్యాదులో పేర్కొంది.సుమారు ఐదు వందల మంది సాయుధ బలగాలతో సాగర్ డ్యామ్ పైకి ఏపీ పోలీసులు వచ్చారని, ప్రధాన డ్యామ్ లోని 13 నుంచి 26 గేట్ల వరకూ ఆస్తుల ధ్వంసానికి పాల్పడ్డారని తెలంగాణ పోలీసులు ఆరోపించారు.

కృష్ణా బోర్డు నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా నీటిని వదిలారని ఫిర్యాదులో పేర్కొన్నారు.దీంతో సెక్షన్ 447, సెక్షన్ 427 కింద కేసు నమోదు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube