టాలీవుడ్ లో “ఆర్ఎక్స్ 100” చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ ఎప్పుడూ వైవిధ్య భరితమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అవుతుంటాడు.కాగా ప్రస్తుతం హీరో కార్తికేయ “రాజా విక్రమార్క” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.
అయితే ఈ చిత్రానికి టాలీవుడ్ నూతన దర్శకుడు శ్రీ సరిపల్లి దర్శకత్వం వహిస్తుండగా సినీ నిర్మాత రమా రెడ్డి నిర్మాత గా వ్యవహరిస్తుంది.అలాగే ఈ చిత్రంలో యంగ్ హీరో కార్తికేయకి జంటగా “తాన్య రవిచంద్రన్” నటిస్తుండగా ప్రముఖ సీనియర్ నటులు “సాయి కుమార్, తనికెళ్ళ భరణి, మరో యంగ్ హీరో సుధాకర్ కొముకుల, హర్ష వర్ధన్” తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.
కాగా ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేశారు.
కాగా ఈ టీజర్ ని ఒకసారి పరిశీలించినట్లయితే ఈ చిత్రం ఇన్వెస్టిగేషన్ మరియు సస్పెన్స్ త్రిల్లర్ జోనర్లో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
అలాగే ఈ చిత్రంలో హీరో కార్తికేయ సిబిఐ ఏజెంట్ పాత్రలో నటిస్తున్నాడు.అయితే టీజర్ “సారీ బాబాయ్” అంటూ హీరో కార్తికేయ చెప్పినటువంటి డైలాగులతో మొదలవుతుంది.ఆ తర్వాత పలు యాక్షన్ సీక్వెన్స్ సన్నివేశాలతో టీజర్ ముగుస్తుంది.అయితే చివర్లో హీరో కార్తికేయ గుమ్మకొండ మాత్రం చిన్నప్పుడు ప్రముఖ హీరో సూపర్ స్టార్ కృష్ణ మరియు హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్ లను ఇన్సిపిరేషన్ గా తీసుకొని ఆవేశపడి జాబ్ లో జాయిన్ అయ్యానని కానీ ఉద్యోగంలో చేరిన తర్వాత సరదా తీరిపోతుందంటూ చెప్పేటువంటి డైలాగులు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.అయితే ఈ టీజర్ ని విడుదల చేసిన మూడు రోజులలోపే దాదాపుగా 3.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి.అంతేకాకుండా పలువురు కార్తికేయ గుమ్మకొండ అభిమానులు కూడా ఈ చిత్రం పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం హీరో కార్తికేయ గుమ్మకొండ వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతున్నాడు.ఈ క్రమంలో కేవలం హీరోగా మాత్రమే కాకుండా పలు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కూడా నటిస్తూ బాగానే ఆకట్టుకున్నాడు.కాగా తాజాగా తమిళ ప్రముఖ హీరో అజిత్ హీరోగా నటిస్తున్న మరో చిత్రంలో కూడా విలన్ గా నటించే అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం.