కొన్ని నెలల క్రితం అల్లు అరవింద్ కొడుకులు ముగ్గురు కూడా గొడవలు పడుతున్నారని, విభేదాలు కొనసాగుతున్నాయని పలు దఫాలుగా చిరంజీవి వారిని పిలిచి రాజీ కుదిరిచే ప్రయత్నాలు చేశారని పుకార్లు షికార్లు చేశాయి.కానీ తాజాగా అవన్నీ కేవలం పుకార్లే అని, అల్లు ఫ్యామిలి, మరోసారి నిరూపించింది.
తాజాగా అల్లు రామలింగయ్య 100వ జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున వేడుక నిర్వహించారు.ఆయన తనయుడు అల్లు అరవింద్ ఎంతో వైభవంగా నిర్వహించిన శతజయంతి ఉత్సవాలు పూర్తిగా అల్లు రామలింగయ్య మనవళ్ళు అయిన బాబీ, అల్లు అర్జున్, శిరీష్ నిర్వహించారు.
ఆ ముగ్గురు ముందుండి కార్యక్రమాలను నడిపించారు.ముగ్గురు మధ్య విభేదాలు లేవని ఈ కార్యక్రమంతో తేలిపోయింది అనడంలో సందేహం లేదు కొందరు.
యాంటీ మెగా ఫ్యాన్స్ కావాలని అల్లు ఫ్యామిలీలో గొడవలు అని మెగా హీరోల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు అని దీన్ని బట్టి అర్థం అవుతుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అల్లు రామలింగయ్య ఫ్యామిలీ అంతా కలిసే ఉందని తాజా కార్యక్రమాల్లో కనిపించిన సన్నివేశాలు.
సంఘటనలు చెప్పకనే చెబుతున్నాయి.భారీ ఎత్తున నిర్వహించిన కార్యక్రమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో అల్లు మరియు మెగా అభిమానుల్లో ఆనందం వ్యక్తం అవుతుంది.
ఇలాగే ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమం తో ఫ్యామిలీ మొత్తం కనిపిస్తే పుకార్లకు చెక్ పెట్టేయొచ్చు అంటూ వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొనడం ద్వారా అల్లు ఫ్యామిలీ తో మెగా ఫ్యామిలీకి ఎలాంటి విభేదాలు లేవని చెప్పకనే చెప్పారు.మొత్తానికి గొడవలు గొడవలు అంటూ ప్రచారం జరగగా అవన్నీ గాలి లో రాతలు అని తేలి పోయింది.ఇకనైనా అలాంటి రాతలు రాకుండా ఉంటాయేమో చూడాలి.
ఒక వైపు మెగా ఫ్యామిలీ హీరోలు అంతా కూడా చాలా హ్యాపీగా ఉండగా కొందరు మాత్రం ఇలా విమర్శలు చేయడం ఎంత వరకు కరెక్టో వారికే తెలియాలి.