అర్థరాత్రిళ్లు దొంగతనాలు జరగడం, ఎవరూ లేని ఇళ్లల్లో లేదా తాళం వేసి ఉన్న ఇళ్లల్లో చోరీలు జరగడం మనం తరచుగా చూస్తుంటాం.అయితే పట్టపగలే బ్యాంకును లూటీ చేసేందుకు పథకం వేశారో ముగ్గురు యువకులు.
కానీ వారు చేసిన ప్రయత్నం విఫలం అయి జైలుకు వెళ్లారు.దీనంతటికి కారణం అక్కడ పని చేసే ఓ సెక్యూరిటీ గార్డు.
అసలు ఏమైంది, ఈ చోరీ యత్నం ఎక్కడ జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పంజాబ్ లోని మోగ జిల్లా దాదాపూర్ గ్రామంలోని ఇండస్ ఇండ్ బ్యాంకును పట్ట పగలే దోచేయాలననుకుని విఫల యత్నం చేశారో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు.
కానీ అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డు మందర్ సింగ్ సాహసం చేసి దొంగలను నిలువరించాడు.ముగ్గురూ అథడిపై దాడి చేస్తున్నా… వారిని పట్టుకునేందుకు ప్రయత్నించాడు.ఈ క్రమంలో దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు.అయితే ఇందుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.దుండగులతో జరిగిన ఘర్షణలో మందర్ సింగ్ గాయపడ్డారు.
చోరులు తనపై కత్తితో దాడి చేశారని పేర్కొన్నాడు.అయితే సెక్యూరిటీ గార్డు సాహసానికి హాట్సాఫ్ అంటూ నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.
ప్రతీ చోట ఇలా నిజాయితీగా, ధైర్యంగా పని చేసే వాడు ఒక్కడుంటే చాలు అసలు దొంగతనాలే జరగవని చెప్తున్నారు.ఆయన చేసిన సాహసం వీడియోను మీరు కూడా ఓసారి చూసేయండి.