Sangareddy District : సంగారెడ్డి జిల్లాలో రోడ్డుప్రమాదం.. ఇద్దరు మృతి

సంగారెడ్డి జిల్లాలో( Sangareddy District ) ఘోర రోడ్డు ప్రమాదం( Road Accident ) జరిగింది.ఆందోల్ మన్సాన్ పల్లిలో అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడింది.

 Sangareddy District : సంగారెడ్డి జిల్లాలో �-TeluguStop.com

ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృత్యువాత పడగా పలువురు గాయపడ్డారు.వెంటనే గమనించిన స్థానికులు బాధితులను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

కాగా ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో ట్రాక్టర్ లో( Tractor ) మొత్తం 30 మంది ప్రయాణిస్తున్నారని తెలుస్తోంది.అనంతరం స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

అనంతరం రోడ్డుప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube