సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురు దుర్మరణం

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.ఓ కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.

ఈ ఘటన ఆందోల్ మండలం కన్సాన్ పల్లి సమీపంలో చోటు చేసుకుంది.కాగా, ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు.

పొగ మంచు కారణంగా రోడ్డు కనిపించకపోవడమే ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

రోడ్డుప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
బంతి పూలతో పాటు ఏ ఏ పూలను దేవుడి పూజ కోసం ఉపయోగించరో తెలుసా..?