వాళ్ళిద్దరి మధ్య రహస్య ఒప్పందం రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్..!!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పీసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించి మోడీ, కేసీఆర్ లపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.రైతుల విషయంలో పార్లమెంటులో నివాళులు అర్పిస్తుంటే టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు… పోడియం వద్ద…గోల చేయడం దారుణమని అన్నారు.

 Revanth Reddy Sensatational Comment's On , Kcr, Modi , Revanth Reddy, Kcr, Modi-TeluguStop.com

తెలంగాణలో యాసంగీ పంట కొంటారా.? లేదా.? అని .సభను తప్పుదోవ పట్టిస్తున్నారని… నినాదాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని కాపాడుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

దీన్ని బట్టి చూస్తే. నరేంద్ర మోడీ గారి చేతిలో.కేసీఆర్ పావుగా మారి… పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న జటిలమైన సమస్య నుండి తప్పించుకోవడానికి టీఆర్ఎస్ అవకాశం కల్పించింది అని.మోడీ తో ఉన్న రహస్య ఒప్పందంలో  భాగంగానే.పార్లమెంటులో టీఆర్ఎస్ ఈ విధంగా వ్యవహరించిందని ఆరోపించారు.హైదరాబాద్ శివారులో భూ కొనుగోలు విషయంలో.కేసీఆర్ కి అత్యంత సన్నిహితంగా ఉండే సంస్థకి ఈడీ నోటీసులు అందించడం జరిగిందని, దీంతో ఆ సంస్థని కాపాడే ప్రయత్నంలో కేంద్రం చేతిలో టీఆర్ఎస్ పావుగా మారిందని పార్లమెంట్ సజావుగా సాగడానికి సహకరించే దిశగా.టీఆర్ఎస్ ఎంపీలు పోడియంలో నిరసనలు తెలిపి శీతాకాల సమావేశాలను బాయ్ కట్ చేసినట్లు.

కేంద్రంతో కేసీఆర్ కి కనెక్షన్ ఉన్నట్లు రేవంత్ రెడ్డి ఆరోపించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube