‘శ్రీ లహరికృష్ణుని గీతామృతం’’ పాటల సీడీ విడుదల..

తమిళనాడు రాష్ట్రం, తిరునల్వేలి జిల్లాకు చెందిన మనుజ్యోతి ఆశ్రమ ఆధ్వర్యంలో, భగవాన్ శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణగారి దివ్య సముఖమున 26, డిసెంబర్ 2021 ఆదివారం సాయంత్రం 5 గంటలకు ‘‘శ్రీ లహరికృష్ణుని గీతామృతం’’ అను పాట సీడీ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్‌లో జరిగినది.

చెన్నైకు చెందిన వి.

జి.పి గ్రూప్ ఛైర్మన్ డా.వి.జి. సంతోషం చేతుల మీదుగా విడుదలైన ఈ సీడీని.నటుడు, నిర్మాత, సంతోషం పత్రిక అధినేత కొండేటి సురేష్ మరియు సినీ నిర్మాత సాయి వెంకట్ స్వీకరించారు.

శ్రీమద్భగవద్గీత’’ను ప్రస్తుత కాలములోని జనులందరికీ అర్థమయ్యేలా శ్రీదేవాశీర్ లారిగారు వివరించిన ‘అక్షయమైన యోగము యొక్క ఉపదేశము’ను పాటల రూపములో రచించి, ప్రజలందరికీ ఆధ్యాత్మిక జీవితమును గ్రహింపజేసేలా ఈ పాటల సీడీని శ్రీ సౌందర్యలహరి క్రియేషన్స్, మనుజ్యోతి ఇంటర్నేషనల్ వారు తయారు చేసి ఉన్నారు.ఈ ఆధ్యాత్మిక సభకు వ్యాఖ్యాత బ్రహ్మశ్రీ పి.మోహన్ గాంధీగారు అధ్యక్షత వహించగా.మనుజ్యోతి ఆశ్రమ అధ్యక్షులు డి.పి.ఉపాజ్ ఎన్.లారిగారు అతిధులకు ఆహ్వానం పలికారు.ఈ సీడీలోని పాటల గురించిన వివరణను ప్రొడ్యూసర్ లియో పి.సి.లారిగారు వివరించారు.ఇంకా ఈ కార్యక్రమములో ఉమాపతి నారాయణ శర్మ, డాక్టర్ పి.బంగారయ్య, గంజికుంట్ల రాఘవేంద్ర, ఆవుల ముత్తయ్యలతో పాటు పలువురు సినీ తారలు, టీవీ ఆర్టిస్టులు పాల్గొన్నారు.

ఈ పాలు చ‌ర్మానికి పూస్తే.. ఆ స‌మ‌స్య‌ల‌న్నీ పరార్‌..!
Advertisement

తాజా వార్తలు