కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల చేరికను కాంగ్రెస్ నేతలు స్వాగతించారని ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు తెలిపారు.అలాగే మాజీ శాసనసభ్యులు చాలా మంది కాంగ్రెస్ లో చేరతారని పేర్కొన్నారు.
ఏపీ పీసీసీ అధ్యక్షుడు మార్పుపై హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని రుద్రరాజు తెలిపారు.కాంగ్రెస్ కోసం పదవిని వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు.
గాంధీ కుటుంబం త్యాగం ముందు తన త్యాగం లెక్క కాదని చెప్పారు.ఏపీలో సీఎం జగన్, దేశంలో మోదీ ఓటమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.