రవితేజ గోపీచంద్ మలినేని కాంబో బ్లాక్ బస్టర్ కాంబో అనే సంగతి తెలిసిందే.డాన్ శీను, బలుపు, క్రాక్ సినిమాలతో ఈ కాంబో ప్రేక్షకులను మెప్పించింది.
ఈ మూడు సినిమాలలో రవితేజ కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుంది.ఈ కాంబోలో మైత్రీ బ్యానర్ పై మరో సినిమా తెరకెక్కుతుందని ప్రచారం జరిగినా ఆ సినిమా ఆగిపోయిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
బడ్జెట్ సమస్యల వల్లే ఈ సినిమాను ఆపేశారని తెలుస్తోంది.రవితేజ( Ravi Teja ) పారితోషికం ప్రస్తుతం 25 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా గోపీచంద్ మలినేని పారితోషికం 12 నుంచి 15 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.
ఈ సినిమాకు బడ్జెట్ 120 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా మార్కెటింగ్ 100 కోట్ల రూపాయలకు మించి చేయడం కష్టమని తెలుస్తోంది.హిందీ డిజిటల్ రైట్స్ కు డిమాండ్ తగ్గడం, శాటిలైట్ హక్కులకు సైతం డిమాండ్ తగ్గడంతో ఈ సమస్య ఎదురైందని భోగట్టా.
గోపీచంద్ మలినేని( Gopichand Malineni ) తర్వాత సినిమాకు హీరో ఎవరనే ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది.ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందో లేదో మేకర్స్ నుంచి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.మిడిల్ రేంజ్ హీరోలు రెమ్యునరేషన్ల( Remunerations )ను తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అలా చేయని పక్షంలో ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది.బాలయ్య గోపీచంద్ మలినేని కాంబోలో భవిష్యత్తులో ఒక సినిమా వచ్చే ఛాన్స్ ఉంది.
బాలయ్య గోపీచంద్ మలినేని కాంబోలో మరో సినిమా ప్రకటన వస్తే మామూలుగా ఉండదని చెప్పవచ్చు.మైత్రీ నిర్మాతలు ఒకవైపు సినిమాలను నిర్మిస్తూ మరోవైపు డిస్ట్రిబ్యూటర్లుగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. మైత్రీ బ్యానర్ సక్సెస్ ఫుల్ బ్యానర్ గా పేరు తెచ్చుకోగా భవిష్యత్తులో ఈ బ్యానర్ లో మరిన్ని క్రేజీ సినిమాలు తెరకెక్కనున్నాయి.సలార్ సినిమాను నైజాంలో ఈ బ్యానర్ రిలీజ్ చేయనుంది.