ముంబై టూ హైదరాబాద్ తిరుగుతున్న రష్మిక.. ఎందుకంటే ?

టాలీవుడ్ లో అతి తక్కువ సమయానికే స్టార్ స్టేటస్ అందుకుని వరుస అవకాశాలతో దూసుకు పోతుంది రష్మిక మందన్న.

ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో గలుగైదు ప్రాజెక్ట్స్ ఉన్నాయి.

టాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్, బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు అందుకుంటూ సత్తా చాటుతుంది.ప్రస్తుతం ఈ బ్యూటీ అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమాలో గిరిజన యువతిగా కనిపించనుంది.ఈ సినిమా ఇంకా పూర్తి కాకుండానే బాలీవుడ్ అవకాశం రావడంతో ఆ ఆఫర్ కూడా ఓకే చేసేసింది.

బాలీవుడ్ లో సిద్దార్థ్ మల్హోత్రా కు జంటగా మిషన్ మజ్ను సినిమాలో నటిస్తుంది.ఈ సినిమా షూటింగ్ లో భాగంగా రష్మిక ముంబై వెళ్ళింది.

Advertisement

అయితే ఆ షూటింగ్ కేవలం ఒక్కరోజు మాత్రమే.నిన్న ముంబై లో షూటింగ్ లో పాల్గొని ఆ షూటింగ్ పూర్తి చేసుకుంది.

ఆ వెంటనే ఈ రోజు మళ్ళీ ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమా షూటింగ్ కోసం ఈ రోజు ఉదయం హైదరాబాద్ కు చేరుకుంది.ఈ సినిమాలో రష్మిక కు జంటగా శర్వానంద్ నటిస్తున్నారు.

కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఇప్పటికే ఈ సినిమా నుండి రష్మిక లుక్ రివీల్ చేసారు.

ఆ పోస్టర్ కు మంచి స్పందన వచ్చింది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది.

ఆ యాంకర్లు బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో పాపులర్.. వింధ్య షాకింగ్ కామెంట్స్ వైరల్!
వదిన సురేఖ వద్ద రెండు కోట్లు అప్పు తీసుకున్న పవన్ కళ్యాణ్.. ఆస్తుల చిట్టా ఇదే?

అందుకే రష్మిక ముంబై టూ హైదరాబాద్ ట్రావెల్ చేస్తూ రెండు సినిమాలను బాలన్స్ చేసుకుంటుంది.ఈ సినిమాలతో పాటు అఖిల్, సురేందర్ రెడ్డి చేస్తున్న ఏజెంట్ సినిమాలో కూడా ఈ బ్యూటీ నే హీరోయిన్ గా నటిస్తుందని సమాచారం.అంతేకాదు అమితాబ్ బచ్చన్ సినిమాలో కూడా రష్మిక కనిపించ బోతుంది.

Advertisement

మొత్తానికి అమ్మడు మంచి జోష్ లో ఉంది.

తాజా వార్తలు