తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.యాంకర్ రష్మీ జంతు ప్రేమికురాలు అన్న విషయం మనందరికీ తెలిసిందే.
మూగజీవాల కోసం ఎంతో పాటుపడుతూ వాటికోసం సహాయ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటుంది.ఈ క్రమంలోనే మూగ జంతువులకు హానికలిగించే రకంగా ఏదైనా వీడియో వైరల్ అయిన అటువంటి సంఘటన కళ్ళెదురుగా జరిగిన వెంటనే ఆ విషయంపై స్పందిస్తుంది.
జంతువులకు హాని కలిగించే వారికి తనదైన శైలిలో గుణ పాఠం చెబుతూ ఉంటుంది.
ఈ విధంగా రష్మీ నిత్యం పెట్స్కు సంబంధించిన స్టోరీలను షేర్ చేస్తుంటుంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా రష్మీ ఓ వీడియోను విడుదల చేసింది.ఆ వీడియలో ఒక స్వచ్చంద సంస్థకు సంబంధించిన వాలంటీర్లు కనిపిస్తున్నారు.
వారంతా కూడా వీధి కుక్కలను ఫీడ్ చేసేందుకు వచ్చినట్టు కనిపిస్తున్నారు.అయితే ఇందులో ఓ ధనవంతుల ఫ్యామిలీ దురహంకారాన్ని రష్మీ చూపించింది.
పెద్ద ఇళ్లు కట్టుకున్నాడు కానీ వారి మనసు మాత్రం ఇలా ఉందంటూ వారి పరువు తీసింది. కుక్కలను వారు ఫుడ్ పెడుతుంటే వద్దని గొడవకు దిగేశాడు.
పైగా వాలంటీర్ల మీద దురుసుగా ప్రవర్తించాడు.
ఆ తరువాత ఓ మహిళ కూడా అలానే ప్రవర్తించింది.మహిళలోని మాతృత్వం ఎక్కడికిపోయింది.ఆమె కూడా ఇలానే ప్రవర్తిస్తోంది?.అంటూ మహిళను ఉద్దేశించి రష్మీ పోస్ట్ వేసింది.అలా రష్మీ మొత్తానికి వీధి కుక్కల విషయంలో పోరాడుతూనే ఉంటుంది.అలా గాయపడిన ఒక కుక్కని తెచ్చుకొని రష్మీ పెంచుకుంటుంది.అయితే రష్మీ పెట్స్ విషయంలో ఎటువంటి పోస్ట్ చేసినా కూడా అభిమానులు నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది.