స్టేజ్ పైనే సొమ్మసిల్లి పడిపోయిన రష్మీ.. కంగారులో అభిమానులు?

బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న యాంకర్ రష్మీ ప్రస్తుతం ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.

ఇలా ఒక వైపు యాంకర్ గా వ్యవహరిస్తూనే, మరో వైపు సినిమా అవకాశాలు అందుకుని ఈమె వెండితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు.

ఈ విధంగా రష్మి కెరియర్ పట్ల ఎంతో బిజీగా ఉన్నారు.ఇకపోతే తాజాగా ఈమె ఈటీవీలో ప్రతి ఆదివారం ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సుడిగాలి సుదీర్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

తాజాగా ఈ వారం ప్రసారం కాబోయే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ ప్రోమోలో భాగంగా ఈ కార్యక్రమంలో సుడిగాలి సుదీర్ కనిపించకపోవడంతో అతని స్థానంలో రష్మీ యాంకర్ గా వ్యవహరించారు.

ఇక ఎప్పటిలాగే ఈ కార్యక్రమంలో జబర్దస్త్ కమెడియన్స్ తమదైన శైలిలో ప్రేక్షకులను సందడి చేశారు.ఇదిలా ఉండగా ఈ ప్రోమో చివరిలో వేదికపై నిలబడిన రష్మీ ఒక్కసారిగా స్టేజ్ పైనే సొమ్మసిల్లి పడిపోయినట్లు చూపించారు.

Advertisement

ఇలా ఈమె సొమ్మసిల్లి పడి పోతున్న క్రమంలో పక్కనే ఉన్నటువంటి ఆటో రాంప్రసాద్ తనని కింద పడకుండా పట్టుకున్నారు.అయితే రష్మీ ఇలా వేదికపైనే పడిపోవడంతో అభిమానులు కాస్త కంగారు పడ్డారు.రష్మి కి ఏం జరిగింది ఎందుకలా సొమ్మసిల్లి పోయింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఇది కేవలం ఎపిసోడ్ పై హైప్ క్రియేట్ చేయడం ఇలా చేసి ఉంటారని ఇందులో కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు అంటూ మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.నిజంగానే రష్మికి ఏమైనా జరిగిందా లేదా కార్యక్రమం కోసమేనా అనే విషయం తెలియాలంటే వచ్చే ఆదివారం వరకు వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు