శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నా ..రాశి ఖన్నా

ఇవాళ వేకువజామున శ్రీవారి తోమాలసేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్న రాశిఖన్నా తిరుమలలోని శ్రీవత్సవ అతిధి గృహంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.

 Rashi Khanna Visited Tirumula Srinivasa Rashi Khanna, Tirumula Srinivasa, Andra-TeluguStop.com

స్వామి వారి దర్శనం మనస్సుకు ఎంతో ప్రశాంత ఇచ్చిందని, జూలై ఒకటోవ తారీఖున విడుదల కాబోయే పక్కా కమర్షియల్ సినిమా విజయవంతం కావాలని స్వామి వారిని ప్రార్ధించినట్లు ఆమె తెలిపారు.త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పక్కా కమర్షియల్ సినిమా కుటుంబంతో కలిసి చూడదగ్గ సినిమా అని, ప్రేక్షకులు అందరూ కుటుంబ సమేతంగా సినిమా వీక్షించి సినిమాను ఆదరించాలని ఆమె కోరారు.

తెలుగులో మరికొన్ని చిత్రాలు చేయబోతున్నానని, తనను ఎంతగానో ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికి మనస్సు పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు రాశిఖన్నా చెప్పారు.అనంతరం కమర్షియల్ సినిమా కో-ప్రొడ్యూసర్ చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ.

శ్రీవారి ఆశీస్సుల కోసం తిరుమలకు రావడం జరిగిందని, రెండేళ్ళు పాటు కష్టపడి పక్కా కమర్షియల్ సినిమాను చిత్రించడం జరిగిందన్నారు.‌ జూలై ఒకటోవ తారీఖున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసురాబోతున్నట్లు ఆయన తెలిపారు.

గోపిచంద్, రాశిఖన్నా జంటగా నటించిన ఈ సినిమా స్వామి వారి ఆశీస్సులతో ఘన విజయం సాధిస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు.పక్కా కమర్షియల్ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని ఆయన కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube