ఖమ్మం జిల్లా పాలేరులో రసవత్తర రాజకీయాలు నెలకొంటున్నాయి.ఈ క్రమంలో నియోజకవర్గం నుంచి పోటీపై ఎమ్మెల్సీ తాతా మధు కీలక వ్యాఖ్యలు చేశారు.
పాలేరు నుంచి మళ్లీ కందాల ఉపేందర్ రెడ్డి పోటీ చేస్తారని తాతా మధు తెలిపారు.బీఆర్ఎస్, వామపక్షాల పొత్తు నేపథ్యంలో పాలేరు నుంచి తమ్మినేని వీరభద్రం పోటీ చేస్తారని ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే.
తాజాగా కందాల పోటీ చేస్తారన్న తాతా మధు వ్యాఖ్యలపై రాజకీయ చర్చ జోరుగా సాగుతోంది.