ఈ మధ్య కాలంలో బిట్ కాయిన్కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.హఠాత్తుగా పెరిగిన దీని డిమాండ్తో అంత ప్రాముఖ్యం చెందుతోంది.
అందుకే యువతకు కూడా చాలా మంది బిట్ కాయిన్ రూపంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు.తాజాగా ఈ జాబితాలో ఓ బాలివుడ్ యాక్టర్ కూడా చేరాడు ఆయనే రాపర్ రఫ్తార్.
ఈ క్రిప్టో కరెన్సీకి ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు పెరుగుతున్నారు.దీనిలో ఎంతమంది పెట్టుబడి దారులు పెరిగితే అంత లాభం వస్తుంది.
ఇంకా ఈ బిట్ కాయిన్ భారత్లో అధికారిక గుర్తింపు రాకున్నా, దీంట్లో పెట్టుబడులు పెట్టడానికి చాలా మంది ఉత్సాహం చూపుతున్నారు.దేశంలో చాలా మంది యువత కూడా క్రిప్టో కరెన్సీని సులభంగా అంచనా వేస్తున్నారు.
అందుకే గతంలో దీనిపై అవగాహన లేని వారు కూడా దీంట్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలుసుకుంటున్నారు.అంతేకాదు ప్రభుత్వం హెచ్చరించినా వారు మాత్రం క్రిప్టో కరెన్సీ వైపే మళ్లుతున్నారు.
దీనికి ప్రధాన కారణం అతి తక్కువ కాలంలోనే ఎక్కువ లాభాలు పొందడం.అయితే, ఈ ప్రముఖ బాలివుడ్ యాక్టర్ రఫ్తార్ కూడా తన ఓ షోకి కరెన్సీకి బదులుగా ఇకపై తను క్రిప్టో కరెన్సీని అంగీకరిస్తానని ప్రకటించాడు.
దీంతో బిట్ కాయిన్ ద్వారా రెమ్యూనరేషన్ అందుకునే మొదటి ఇండియన్ యాక్టర్గా ఈయన నిలిచాడు.

జూలైలో రఫ్తార్ ఓ వర్చువల్ షో లో ఓ ప్రదర్శన చేయనున్నారు.దాని రెమ్యూనరేషన్ బిట్ కాయిన్ రూపంలో తీసుకుంటానని తెలిపారు.అంతేకాదు రఫ్తార్ బిజినెస్ పార్టనర్ మేనేజర్ అంకిత్ క్రిప్టో కరెన్సీపై బాగా అవగాహన కలిగిన వ్యక్తి అని తెలిపారు.
అంతేకాదు, ఇతను తన పనులకు ఎటువంటి అంతరాయం లేకుండా స్పీడ్గా జరిగేలా ఆలోచిస్తానని అన్నాడు.కానీ, ఆ క్రెడిట్ అంతా అంకిత్కే చెందుతుందని చెప్పారు. క్రిప్టో కరెన్సీ ద్వారా దెబ్బతిన్న సంగీత కళాకారులు మధ్యవర్తుల అవసరం లేకుండా ప్రదర్శన ఇవ్వచ్చని అన్నారు.

కెనడాలోని ఒట్టావాలో వందమంది ప్రైవేటు వ్యక్తుల కోసం 60 నిమిషాల కార్యక్రమం నిర్వహించనున్నారు.దీనికి కూడా ఆయన బిట్ కాయిన్ రూపంలోనే రెమ్యూనరేషన్ తీసుకోనున్నారు.రానున్న కాలంలో మరింత మంది సెలబ్రెటీలు ఈ జాబితాలో చేరే అవకాశం కూడా లేకపోలేదు.
ఎందుకంటే బిట్ కాయిన్ క్రిప్టో కరెన్సీకి అంత క్రేజ్ పెరిగింది.వివిధ కంపెనీలకు సంబంధించిన బిట్ కాయిన్లు అందుబాటులో ఉన్నాయి.ఇటీవల వజీర్ ఎక్స్ కూడా కేవలం రూ.100 ద్వారా బిట్ కాయిన్లో పెట్టుబడులు పెట్టే అవకాశాన్ని కల్పించింది.దీంతో ఏ మాత్రం అవగాహన ఉన్నా.ఇందులో సులభంగా పెట్టుబడులు పెట్టుకోవచ్చు.