మహాభారతం మొత్తం సినిమా తీస్తా అంటున్న దర్శక దిగ్గజం

టాలీవుడ్ దర్శక దిగ్గజం రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

భారీ మల్టీ స్టారర్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా బిజినెస్ కూడా ఇప్పటికే జరిగిపోయిందనే టాక్ వినిపిస్తుంది.

ఈ సినిమాలో హాలీవుడ్ నటులు కూడా కీలక పాత్ర చేస్తూ ఉండటంతో ఇండియన్ మార్కెట్ తో పాటు హాలీవుడ్ మార్కెట్ ని కూడా సొంతం చేసుకుని బాహుబలి కలెక్షన్స్ రికార్డ్ ని బ్రేక్ చేయాలని అనుకుంటున్నారు.ఇదిలా ఉంటే తన లైఫ్ డ్రీం మహాభారతం అని గతంలో రాజమౌళి చెప్పిన సంగతి అందరికి తెలిసిందే.

అయితే ప్రస్తుతం మహాభారతం బేస్ చేసుకొని చాలా సినిమాలు వస్తున్న నేపధ్యంలో దానిపై రాజమౌళి ఆలోచన ఇంకా ఉందే అనే అనుమానం అందరికి వచ్చింది.దీనికి తాజాగా మత్తు వదలరా సినిమా సూపర్ హిట్ కావడంతో ఆ చిత్ర యూనిట్ మరింత ప్రమోషన్ మీద దృష్టిపెట్టారు.

అందులో భాగంగా రాజమౌళి ఆ చిత్ర యూనిట్ తో జరిగిన చిట్ చాట్ లో ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.కథ డిమాండ్ చేస్తే కొత్తవాళ్లతో తీయడానికి కూడా తాను సిద్ధమే అని చెప్పిన జక్కన్న మహాభారతం సినిమాపై కూడా వ్యాఖ్యలు చేశారు.

Advertisement

మహాభారతం సినిమాలో ఏదో ఒక్క ఎపిసోడ్ తీసి వదిలేసే ఆలోచన లేదని, మహాభారతం కథ మొత్తం సినిమాగా తీస్తానని తెలియజేసారు.అయితే ఎన్ని భాగాలుగా తీస్తాడు అనేది తెలియాల్సి ఉంది.

సొంత ఇంటి కల నెరవేర్చుకున్న బిగ్ బాస్ బ్యూటీ శోభ.. ఫోటోలు వైరల్!
Advertisement

తాజా వార్తలు