పెద్దపల్లి జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది.అకాల వర్షంతో మంథని మార్కెట్ యార్డులో ధాన్యం తడిసిపోయింది.
వరదతో ధాన్యం కొట్టుకుపోయింది.
ఈ క్రమంలో ధాన్యాన్ని కాపాడుకునేందుకు అన్నదాతలు తీవ్ర అవస్థలు పడ్డారు.
ధాన్యం అమ్మితే వచ్చే సొమ్మును ఖరీఫ్ సీజన్ పెట్టుబడి కోసం వాడుకుందామనుకున్న రైతుల ఆశలను వర్షం ఆవిరి చేసింది.దీంతో రైతులు లబోదిబోమంటున్నారు.