విశాఖ రైల్వే జోన్ అంశాన్ని వివాదాస్పదంగా మార్చారని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.రైల్వే జోన్కు తెలంగాణకు సంబంధం లేదని తేల్చిచెప్పారు.
రైల్వే జోన్కు కేంద్ర కేబినెట్ అప్రూవల్ ఇచ్చిందని.ఈ క్రమంలోనే డీపీఆర్ తయారైందని తెలిపారు.
రైల్వే జోన్ పనులకు రాష్ట్ర ప్రభుత్వం కొంత భూమి ఇవ్వాల్సి ఉందన్న ఆయన, ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు జరుగుతున్నాయని వెల్లడించారు.విశాఖ రైల్వే జోన్ను కేంద్రమంత్రి త్వరలోనే ప్రారంభిస్తారని పేర్కొన్నారు.
అనంతరం మేం రైల్వే జోన్ తెస్తుంటే తమపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.