మరోమారు వైఎస్ జగన్ కి లెటర్ రాసిన రఘురామకృష్ణంరాజు..!!

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏపీ సీఎం జగన్ కి లెటర్లు  రాస్తూ సరికొత్త రాజకీయ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు.

ఇప్పటికే పలుమార్లు లెటర్లు రాసిన రఘురామకృష్ణంరాజు తాజాగా మరోసారి లెటర్ రాయడం జరిగింది.

గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పేదలందరికీ ఇల్లు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది.అందువల్లే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సమయంలో పేదల నుండి మద్దతు వచ్చింది.

  అంతే కాకుండా పేదల ఇల్లు కోసం నిధులు గత ప్రభుత్వాలు ఖర్చుపెట్టిన వాటి కంటే ఎక్కువగా ఖర్చు పెడతామని హామీ ఇచ్చారు అని లెటర్ లో రఘురామకృష్ణంరాజు గుర్తు చేయడం జరిగింది.ఈ నేపథ్యంలో ప్రస్తుతం జగనన్న కాలనీ లు అంటూ ప్రభుత్వం కడుతున్న ఇల్లల్లో కనీస మౌలిక సదుపాయాలు లేవనిమండిపడ్డారు.

కేంద్ర ప్రభుత్వం పీఎంఏవై కింద రాష్ట్రాలకు నిధులు ఇస్తోందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు.ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఇళ్ల నిర్మాణం చాలా త్వరగా చేపట్టాలని, అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి పేదలకు ఇళ్లు అందివ్వాలి అని రఘురామకృష్ణంరాజు లెటర్లో స్పష్టం చేశారు.

Advertisement

 .

పవన్ కళ్యాణ్ పై ఎన్నికల సంఘానికి మరో ఫిర్యాదు..!!

Advertisement

తాజా వార్తలు