Radisson Drugs Case : రాడిసన్ డ్రగ్స్ పార్టీ కేసు: హైకోర్టుకు దర్శకుడు క్రిష్..!!

హైదరాబాద్ రాడిసన్ డ్రగ్స్ పార్టీ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది.

సినీ డైరెక్టర్ క్రిష్( Director Krish ) హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

పోలీసుల విచారణకు ఇవాళ వ్యక్తిగతంగా హాజరు అవుతానని క్రిష్ రెండు రోజుల కిందట సమాచారం అందించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఆయన విచారణను హాజరుకాకుండా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

అయితే క్రిష్ తప్పనిసరిగా విచారణకు హాజరు కావాల్సిందేనని గచ్చిబౌలి పోలీసులు చెబుతున్నారని తెలుస్తోంది.కాగా రాడిసన్ డ్రగ్స్ పార్టీ( Radisson Drugs Case ) కేసులో డైరెక్టర్ క్రిష్ ఏ10 గా ఉన్నారు.ఫిబ్రవరి 24న జరిగిన డ్రగ్స్ పార్టీలో దర్శకుడు క్రిష్ పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు.

ఈ క్రమంలోనే నిర్భయ్ సింది, వివేక్ తో కలిసి క్రిష్ కూడా డ్రగ్స్ తీసుకున్నారని తెలుస్తోంది.డ్రగ్స్ పార్టీ జరిగిన ప్రతిసారి రాడిసన్ హోటల్ లో క్రిష్, నిర్భయ్ కలుసుకున్నట్లు పోలీసులు గుర్తించారని సమాచారం.

Advertisement
అధ్యక్ష ఎన్నికల వేళ డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ రిలీఫ్.. ఆ కేసు కొట్టివేత

తాజా వార్తలు