కొన్నిరోజుల క్రితం రచ్చ రవికి యాక్సిడెంట్ అయిందని సోషల్ మీడియాలో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.అయితే వైరల్ అయిన వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని రచ్చ రవి సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు.
తాజాగా రచ్చ రవి ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ చిరంజీవి తల్లి గురించి చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.రచ్చ రవి మాట్లాడుతూ ఒక రెండు నిమిషాలు ఎక్కువగా మాట్లాడతానని చెప్పారు.
లైఫ్ లో ఇంకెక్కడా మాట్లాడనని సుమ కూడా నన్ను ఆపొద్దని రచ్చ రవి తెలిపారు.వరంగల్ నీళ్లు తాగి హైదరాబాద్ కు వచ్చానని కృష్ణానగర్ లో కన్నీళ్లు తాగి బ్రతికానని రచ్చ రవి అన్నారు.కానీ అప్పటికీ ఇప్పటికీ మెగాస్టార్ అభిమానిగానే బ్రతికానని రచ్చ రవి తెలిపారు. చిరంజీవి అన్నను ఒక్కసారి చూస్తే చాలని అనుకున్నానని కానీ వాల్తేరు వీరయ్య మూవీలో చిరంజీవి గారితో నటించే ఛాన్స్ దక్కిందని రచ్చ రవి కామెంట్లు చేశారు.
అంజనమ్మకు ముగ్గురు కొడుకులు అయితే నాకు నేనుగా నన్ను నేను నాలుగో కొడుకుగా ప్రకటించుకుంటానని రచ్చ రవి అన్నారు.తాను ఆస్తిలో వాటా అడగటం లేదని ఎప్పుడూ వారి వెనకే ఉంటానని రచ్చ రవి కామెంట్లు చేశారు.మెగాస్టార్ ను చూసే ఛాన్స్ వస్తే చాలు అనుకున్నానని ఇప్పుడు మాట్లాడే అవకాశం వచ్చిందని ఈ జీవితానికి ఇదే చాలు అని రచ్చ రవి కామెంట్లు చేయడం గమనార్హం.వాల్తేరు వీరయ్య మూవీ 250 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించగా ఫుల్ రన్ లో 300 కోట్ల రూపాయల కలెక్షన్లను ఈ సినిమ సొంతం చేసుకుంటుందో లేదో చూడాల్సి ఉంది.
చిరంజీవి భిన్నమైన కథలను ఎంచుకుంటూ ఇతర స్టార్స్ కు గట్టి పోటీ ఇస్తున్న సంగతి తెలిసిందే.