ప్రజలను అలెర్ట్ గా ఉండమంటున్న టాలీవుడ్ బ్యూటీ..!

ఢిల్లీ సోయగం రాశీ ఖన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే ఎన్నో చిత్రాలలో నటించి తన కంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంది.

అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో నాగసౌర్య సరసన ఊహలు గుసగుసలాడే చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీ కి పరిచయమైంది రాశి ఖన్నా.ఎన్ని సినిమాలు చేసిన ఈ బ్యూటీ మాత్రం స్టార్ స్టేటస్ అందుకోలేకపోయింది.

అందుకోసం ఇప్పటికి శ్రమిస్తూనే ఉంది.ప్రస్తుతం రాశి ఖన్నా చేతినిండా సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఈ బ్యూటీ ఏ లుక్ లో అయినా ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.ఈమె ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం సినిమాలను లైన్లో పెట్టింది.

Advertisement

అయితే ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమయ్యింది.ముందుకన్నా వేగంగా విస్తరిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంది.

కరోనా కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ కూడా పెట్టింది.ఈ నేపథ్యంలోనే ఈ అమ్మడు పదే పదే ప్రజలను అలెర్ట్ గా ఉందామంటూ హెచ్చరిస్తుంది.

ఈ ఢిల్లీ బ్యూటీ ప్రజలను మాస్క్ పెట్టుకోండి.ఇంట్లోనే ఉండండి.

అప్పుడే మనందరం సురక్షితంగా ఉంటాం అని చెబుతుంది.అంతేకాదు తాను కూడా మాస్క్ పెట్టుకుని ఇంట్లోనే ఉంటున్నా అంటూ తెలిపింది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

ప్రజలు ఈ సమయంలో అలెర్ట్ గా ఉండాలంటూ సూచిస్తుంది.ప్రస్తుతం రాశీ చేతిలో దాదాపు ఏడు సినిమాలు ఉన్నట్టు సమాచారం.

Advertisement

తెలుగులో ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో గోపీచంద్ కు జంటగా పక్కా కమర్షియల్ సినిమా, విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య కు జంటగా థాంక్యూ సినిమాలో నటిస్తుంది.కోలీవుడ్ లో కూడా ఈ అమ్మడికి వరస అవకాశాలు అందుతున్నాయి.

చూస్తుంటే ఈ అమ్మడు జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు.

తాజా వార్తలు