పాము ముంగిసల గొడవ, పోరాటం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ రెండింటి మధ్య తరచుగా గొడవలు జరగడం.
వాటిని మనం చూడటం చాలా సార్లు జరుగుతూనే ఉంటుంది.అయితే ఓ కొండ చిలువ మాత్రం ఓ పక్షిని వెంటాడింది.
పట్టు వదలని విక్రమార్కుడిలా పోరాడి మరీ ఆ పక్షిని అమాంతంగా మింగేసింది.ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
అయితే ఆ వీడియో ఏంటి, అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది, ఆ సంగతి ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఝూర్ఖండ్ లోహర్దగాలోని భండారా ప్రాంతంలో ఓ కొండ చిలువ హల్ చల్ చేసింది.
ఆహారం తినేందుకు నేలపై వాలిన ఓ పక్షిపై దాడికి దిగింది.ఆ పాము ఎంత ఆకలిగా ఉందో.
ఆ పక్షిని వేటాడడంలో కనిపిస్తోంది.పక్షి ఎంత తప్పించుకోవాలని చూసినా పైథాన్ వదల లేదు.
దాదాపు అరగంట సేపు పోరాటం చేసి అలసిపోయిన ఆ పక్షిని.పైథాన్ అమాంతం మింగేసింది.
ఈ ఘటనను చూసిన గ్రామస్థులు ఆశ్చర్యపోయారు.పాము, ముంగిసల గొడవ చూశామే కానీ ఇలా పాము, పక్షిల గొడవ చూడం ఇదే మొదటి సారని తెలిపారు.
అక్కడ ఉన్న కొంత మంది యువకులు ఈ పాము, పక్షిల యుద్ధాన్ని సెల్ ఫోన్ లో చిత్రీకరించారు.దాన్ని నెట్టింట్లో పెట్టగా.
వీడియో వైరల్ గా మారింది.దీన్ని చూసిన ప్రతీ ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు.