టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మొదటి సినిమా లైగర్ ఈ సినిమాలో లైగర్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది.రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మొదటిసారి పాన్ ఇండియా సినిమాలో నటిస్తుండడంతో ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు.
హై వోల్టేజ్ స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న లైగర్ సినిమా కోసం విజయ్ కూడా చాలా కష్ట పడుతున్నాడు.ఈ సినిమాకి సంబంధించిన చివరి షెడ్యూల్ ను మేకర్స్ విజయ వంతంగా పూర్తి చేసి ఆగస్టు 25న రిలీజ్ చేయడానికి అంతా సిద్ధం చేసారు.
ఇక ఈ సినిమా తర్వాత వెంటనే పూరీ గ్యాప్ లేకుండా తన నెక్స్ట్ సినిమా జనగణమన కూడా స్టార్ట్ చేస్తున్నాడు పూరీ.
ఇక ఈ సినిమాపై నిర్మాత ఛార్మీ కౌర్ ఒక అప్డేట్ ఇచ్చింది.
ఈ క్రేజీ అప్డేట్ తో పాటు ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేసింది.JGM అంటూ ఈ పోస్టర్ రిలీజ్ చేసింది.
పూరీ కనెక్ట్స్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఈ రోజు గ్రాండ్ గా ముంబై లో లాంచ్ చేయ బోతున్నారు.ఇప్పటికే విజయ్ ఆర్మీ డ్రెస్ లో ముంబై చేరుకున్నాడు.
ఈయనతో పాటు పూరీ జగన్నాథ్, ఛార్మీ, వంశీ పైడిపల్లి కూడా అక్కడికి చేరుకున్నారు.
ఈ క్రమంలోనే ఛార్మీ JGM అంటూ సినిమా పేరుతో ఉన్న పోస్టర్ రిలీజ్ చేసింది.
ఈ పోస్టర్ లో రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు.ఈ సినిమాను 2023, ఆగస్టు 3న రిలీజ్ చేయనున్నట్టుగా వెల్లడించారు ఈ క్రేజీ న్యూస్ విన్న రౌడీ స్టార్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మరి ఇంకొన్ని వివరాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి ఉండాల్సిందే.