చిరంజీవి-బాబీ సినిమాని కన్ఫర్మ్ చేసిన పూరి జగన్నాథ్ ట్వీట్

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మంచి జోరు మీద ఉన్నారు.గ్యాప్ తీసుకోకుండా వరుసగా సినిమాలు చేయడానికి దర్శకులని లైన్ గా సెట్ చేసుకొని ఉన్నారు.

కొంత మంది సీనియర్ దర్శకులు అయితే కొంత మంది యంగ్ టాలెంటెడ్ దర్శకులు చెప్పిన కథలు వింటూ వాటిలో నచ్చిన వాటికి ఒకే చెప్పేస్తున్నారు.మెగాస్టార్ చేయబోయే ప్రతి సినిమా కూడా వీలైనంత వరకు కొణెదల ప్రొడక్షన్ పై రామ్ చరణ్ నిర్మాణంలోనే తెరకెక్కే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఆచార్య సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లిన చిరంజీవి నెక్స్ట్ లూసిఫర్ రీమేక్, అలాగే వేదాళం రీమేక్ లని లైన్ లో పెట్టారు.ఇందులో ఒకదానికి వివి వినాయక్ దర్శకుడు కాగా మరొకటి మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కనుంది.

ఇదిలా ఉంటే చిరంజీవి యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని చాలా రోజులుగా ఒక వార్త వినిపిస్తుంది.అయితే దీనిపై ఎలాంటి సమాచారం బయటకి రాలేదు.

Advertisement

అఫీషియల్ ప్రకటన వస్తుందని భావిస్తున్నారు.అయితే ఈ మధ్య చిరంజీవి చేయబోయే సినిమాలు ఆయన నోటి నుంచి కాకుండా వేరొకరి నోటి నుంచి బయటకి రావడం విశేషం.

మెహర్ రమేష్ తో చిరంజీవి చేయబోయే ప్రాజెక్ట్ గురించి పవన్ కళ్యాణ్ తన పుట్టిన రోజు సందర్భంగా ట్విట్టర్ లో మెహర్ రమేష్ కి బెస్ట్ అఫ్ లక్ చెబుతూ రివీల్ చేసేశాడు.ఇప్పుడు బాబీ దర్శకత్వంలో చేయబోయే సినిమా గురించి దర్శకుడు పూరీ జగన్నాథ్ పుట్టినరోజు సందర్భంగా రివీల్ చేసేశాడు.

ట్విట్టర్ లో అందరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ వచ్చిన పూరీ మెగా ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చాడు.డైరెక్టర్ బాబీ విషెస్ చెప్తూ చేసిన ట్వీట్ ని రీట్వీట్ చేసిన పూరీ బాబీకి కృతజ్ఞతలు తెలుపుతూ బాస్ తో కిక్కాస్ ఫిల్మ్ చేయమని ట్వీట్ చేసాడు.

దీంతో చిరు - బాబీ కాంబోపై స్పష్టత వచ్చేసింది.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు