లైగర్ వల్ల కరణ్ కు ఎటువంటి నష్టం లేదా.. అంతా పూరీపైనే భారం!

ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయినా లైగర్ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది.ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించగా.

రిలీజ్ అయినా అన్ని చోట్ల ప్లాప్ టాక్ తెచ్చుకుంది.దీంతో అందరు ఒక్కసారిగా షాక్ అయ్యారు.

ఫ్యాన్స్ ను మాత్రమే కాదు సాధారణ ప్రేక్షకులను కూడా ఏ విషయంలో సంతృప్తి పరచలేక పోవడం ఈ సినిమా కలెక్షన్స్ కు గండి కొట్టింది.సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ సినిమాపై చాలా అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్.

పూరీ, విజయ్ కెరీర్ లలోనే హైయెస్ట్ బడ్జెట్ తో భారీ స్థాయిలో, భారీ టెక్నీషియన్స్ తో ఈ సినిమాను తెరకెక్కించాడు.అయితే ఎన్ని అంచనాలు పెట్టుకున్నారు అంత ప్లాప్ అయ్యింది.

Advertisement

అయితే ఈ సినిమా ఇంత ప్లాప్ అవ్వడానికి కారణాలు చాలానే చెబుతున్నారు.ఈ సినిమా ఓపెనింగ్స్ బాగానే రాబట్టిన ఆ తర్వాత వచ్చిన టాక్ తో కలెక్షన్స్ పడిపోయాయి.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా దాదాపు 20 కోట్ల నష్టాలను మిగిల్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.ఇక ఈ సినిమాలో బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ కూడా భాగం అయ్యారనే విషయం తెలిసిందే.హిందీలో ఈ సినిమాను కరణ్ జోహార్ రిలీజ్ చేసారు.

అందుకే ఆయన కూడా డబ్బులు ఖర్చు చేయగా ఈ 20 కోట్ల నష్టం ఆయనకే నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయి అనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట.కానీ అసలు విషయం ఏంటంటే ఈ సినిమాను కరణ్ కు పూరీ ఫ్రీగానే ఇచ్చారని.దీంతో ఈ సినిమా వల్ల ఆయన నష్టపోయేది ఏమీ లేదని నష్టం అనేది జరిగితే అది పూరీకే వస్తుంది అని అంటున్నారు.

రూ.10 లక్షల విరాళం ప్రకటించినా రష్మికపై ట్రోల్స్.. అలా చేయడమే తప్పైందా?
Advertisement

తాజా వార్తలు