భారతదేశంలో పెద్ద సంఖ్యలో ఎన్ఆర్ఐలను( NRI’s ) కలిగి ఉన్న రాష్ట్రాల్లో పంజాబ్( Punjab ) కూడా ఒకటి.స్వాతంత్య్రానికి పూర్వమే పంజాబీలు వివిధ దేశాలకు వలసవెళ్లి అక్కడ స్థిరపడ్డారు.
అయితే దేశం కానీ దేశంలో వారు సమస్యలను ఎదుర్కొంటున్నారు.జీవితంలో స్థిరపడాలనే ఉద్దేశంతో కొందరు దొడ్డిదారిన విదేశాలకు వెళ్లి ఇబ్బందులు పడుతున్నారు.
కొద్దిరోజుల క్రితం అమెరికా ప్రభుత్వం( US Government ) బహిష్కరించిన భారతీయుల జాబితాలో పంజాబీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు.
ఇకపోతే.
వివిధ దేశాల్లో ఉన్న పంజాబీలకు సొంత రాష్ట్రంలోనూ పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.వారి ఆస్తులను ఆక్రమించడం, కబ్జా చేయడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
ఎన్ఆర్ఐల సంక్షేమం కోసం పంజాబ్ ప్రభుత్వం ఎప్పటి నుంచో పలు చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.తాజాగా సమస్యల్లో ఉన్న పంజాబీ ప్రవాసుల కోసం వాట్సాప్ నంబర్ 9056009884ను భగవంత్ మాన్ ప్రభుత్వం ప్రారంభించింది.

ఈ నెంబర్కు వచ్చిన ఫిర్యాదులను తక్షణం సంబంధిత ప్రభుత్వ విభాగానికి, అలాగే పంజాబ్ పోలీస్ అదనపు డైరెక్టర్ (ఎన్ఆర్ఐ విభాగం)కు పంపుతారు.దీనితో పాటు nri.punjab.gov.in ను కూడా సందర్శించవచ్చని ప్రభుత్వం వెల్లడించింది.
ఎన్ఆర్ఐ వ్యవహారాల మంత్రి కుల్దీప్ సింగ్ ధాలివాల్( NRI Minister Kuldeep Singh Dhaliwal ) మాట్లాడుతూ.తమ శాఖ వివిధ పత్రాలపై కౌంటర్ సైన్, ధృవీకరణను సులభతరం చేస్తోందన్నారు.

కాగా.ఇటీవల ఎన్ఆర్ఐల కబ్జా సమస్యలను పరిష్కరించడానికి ‘‘ ఎన్ఆర్ఐ సభ పంజాబ్ ’’ కీలక ప్రతిపాదన చేసిన సంగతి తెలిసిందే.అదే ‘Gold for NRIs, Green for Punjab’ .దీని ప్రకారం పంజాబ్లో 25 శాతం పైగా వ్యవసాయ భూములను కలిగి ఉన్న ఎన్ఆర్ఐలు తమ భూమిని అమ్మడం లేదా లీజుకు ఇవ్వడం కంటే చెట్ల పెంపకం వంటి ప్రాజెక్ట్లకు ఉపయోగించుకోవాలని ఎన్ఆర్ఐ సభ సూచించింది.ఆ విధానం ఆర్ధికంగా రాబడితో పాటు బహుళ ప్రయోజనాలు అందిస్తుందని పేర్కొంది.