లవ్ స్టోరీ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత

సాయి పల్లవి, నాగ చైతన్య జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ లవ్ స్టోరీ.

ఈ మూవీ ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉన్న కరోనా సెకండ్ వేవ్, లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది.

సాయి పల్లవి చాలా కాలం తర్వాత తెలుగులో చేస్తున్న మూవీ కావడంతో భారీగానే హైప్ ఉంది.అలాగే ఈ సినిమా నుంచి వచ్చిన రెండు సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి.

సారంగాదరియా సాంగ్ అయితే సెన్సేషన్ క్రియేట్ చేస్తూ మరోసారి సాయి పల్లవి ఖాతాలో భారీ వ్యూస్ రికార్డుని వేసింది.తక్కువ సమయంలోనేవంద మిలియన్ క్లబ్ ని ఈ సాంగ్ క్రాస్ చేసింది.

ఇదిలా ఉంటే ఈ మూవీని ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లోనే ఎమోషనల్ డ్రామాతో శేఖర్ కమ్ముల ఆవిష్కరించారు.

Advertisement

కమ్ముల సినిమా అంటే అందులో కథకంటే పాత్రల ప్రయాణం, కథనం చాలా ఆసక్తిగా ప్రేక్షకులని కట్టిపడేసే విధంగా ఉంటుంది.ఈ కారణంగానే అతని సినిమాలకి మంచి క్రేజ్ ఉంది.ఈ నేపధ్యంలో ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల సాయిపల్లవి కాంబో కావడం కూడా లవ్ స్టొరీపై ఎక్కువ హైప్ ఉండటానికి కారణం అని చెప్పాలి.

ఇదిలా ఉంటే ఈ మూవీ రిలీజ్ పై తాజాగా నిర్మాత సునీల్ నారంగ్ మీడియాతో మాట్లాడారు.నైట్ కర్ఫ్యూ కూడా తొలగించిన తర్వాతనే లవ్ స్టొరీని థియేటర్ లో రిలీజ్ చేస్తామని చెప్పారు.

మూడు షోలకి పర్మిషన్ ఇచ్చినా కూడా రిలీజ్ చేయమని, కంప్లీట్ గా నార్మల్ సిచువేషన్ వచ్చి థియేటర్స్ కూడా పూర్తి స్థాయిలో ఓపెన్ అయ్యాకనే రిలీజ్ కి వెళ్తామని స్పష్టం చేశారు.

వదిన సురేఖ వద్ద రెండు కోట్లు అప్పు తీసుకున్న పవన్ కళ్యాణ్.. ఆస్తుల చిట్టా ఇదే?

Advertisement

తాజా వార్తలు