బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 కన్నుమూసిన నేపథ్యంలో భారత్ ఒకరోజు సంతాప దినాన్ని ప్రకటించింది.సెప్టెంబర్ 11, ఆదివారం నాడు క్వీన్ ఎలిజబెత్ గౌరవార్థం దేశ వ్యాప్తంగా సంతాపాన్ని పాటిస్తారు.
అదేవిధంగా అన్ని అధికార భవనాలపై జాతీయ జెండాను సగం వరకు మాత్రమే ఎగురవేస్తారు.ఆ రోజున ఎలాంటి అధికారిక వినోద కార్యక్రమాలు నిర్వహించరని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.