మళయాళ ప్రేమం సినిమా అప్పట్లో ఒక పెద్ద సంచలనం సృష్టించింది.ఆల్ఫోన్స్ పుత్రేన్ డైరక్షన్ లో తెరకెక్కిన ప్రేమంలో నవీన్ పౌలి, సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్ నటించారు.
ఆ సినిమాలో నటించిన వారందరికి సూపర్ క్రేజ్ వచ్చింది.అదే మూవీని తెలుగులో అదే టైటిల్ తో రీమేక్ చేశారు.
అయితే ప్రేమం తో హిట్ అందుకున్న ఈ డైరక్టర్ ఏడేళ్ల తర్వాత గోల్డ్ అంటూ ఒక సినిమా చేశాడు.మళయాళ స్టార్ పృధ్వి రాజ్ హీరోగా నటించిన ఈ సినిమాలో నయనతార ఫీమేల్ లీడ్ గా నటించింది.
గురువారం రిలీజైన ఈ గోల్డ్ మూవీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.సినిమాలో అంత పెద్ద స్టార్ కాస్ట్ ఉన్నా సరే గోల్డ్ డైర్కటర్ ఆల్ఫోన్స్ వారికి సరిగా వాడుకోలేదని అంటున్నారు.అంతేకాదు సినిమా షార్ట్ ఫిల్మ్ లానే ఉందని కామెంట్స్ చేస్తున్నారు.ప్రేమంతో అంత పెద్ద హిట్ అందుకున్న డైరక్టర్ ఇన్నేళ్ల తర్వాత ఇలాంటి సినిమాతో రావడం ఆడియన్స్ కి షాక్ ఇచ్చింది.
సినిమా రిలీజ్ కు ముందు టీజర్, ట్రైలర్ కనీసం సాంగ్స్ లేకుండా డైరెక్ట్ గా రిలీజ్ చేసి షాక్ ఇచ్చాడు డైరక్టర్ ఆల్ఫోన్స్.