పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత సాలిడ్ హిట్ కొట్టలేక పోయాడు.సాహో సినిమా మన దగ్గర విజయం సాధించక పోయిన బాలీవుడ్ లో కలెక్షన్స్ బాగానే రాబట్టింది.
అయితే ఇటీవలే రిలీజ్ అయినా రాధేశ్యామ్ కూడా హిట్ కొట్టలేక పోయింది.ఇలా ప్రభాస్ చేసిన రెండు సినిమాలు విజయం సాధించక పోవడంతో ఆయన ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు.
ప్రభాస్ చేతిలో ప్రెసెంట్ నాలుగైదు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి.అందులో ‘సలార్‘ సినిమా ఒకటి.
కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాను హోంబళ్లే ప్రొడక్షన్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తుండగా.
శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.ప్రెసెంట్ ప్రభాస్ అభిమానులు ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచు కుంటున్నారు.
కెజిఎఫ్ భారీ విజయం సాధించడంతో సలార్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని ఆశగా ఎదురు చూస్తున్నారు.అయితే ఈ సినిమా నుండి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో అందరు దీని కోసం ఎదురు చూస్తున్నారు.
అలంటి వారి కోసం ఈ సినిమా నిర్మాత ఒక అప్డేట్ ఇచ్చాడు.ఈ సినిమా షూటింగ్ వివరాలతో పాటు రిలీజ్ డేట్ ని కూడా కంఫర్మ్ చేసారు.
ఈ సినిమా ఇప్పటికే 35 శాతం షూటింగ్ పూర్తి అయ్యిందని.నెక్స్ట్ షెడ్యూల్ వచ్చే వరం నుండి స్టార్ట్ కాబోతుంది అని చెప్పుకొచ్చారు.ఈ ఏడాది నవంబర్ నాటికీ షూటింగ్ మొత్తం పూర్తి చేసి 2023 సమ్మర్ సీజన్ లో ఈ సినిమాను రిలీజ్ చేస్తామని నిర్మాత ప్రకటించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.అంతేకాదు సలార్ సినిమా కోసం మరింత బడ్జెట్ పెట్టి భారీ హంగులు దిద్ది యాక్షన్ సన్నివేశాలను రూపొందించడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది.