ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి ఏ సెలబ్రిటీ జాతకం గురించి మాట్లాడిన ఆ జాతకం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది.ప్రభాస్ జాతకం గురించి గతంలో షాకింగ్ కామెంట్లు చేసిన వేణుస్వామి తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ జాతకం గురించి మరోసారి షాకింగ్ కామెంట్లు చేయడం గమనార్హం.
నేను కాసినో ఆడనని అయితే మూహూర్తాలు పెడతానని ఆయన తెలిపారు.
నేను ఎయిర్ పోర్ట్ కు వెళితే ప్రోటోకాల్ ఉంటుందని 500 రూపాయలు ఇస్తే హైదరాబాద్ లో ఎవరికైనా ప్రోటోకాల్ ఇస్తారని ఆయన అన్నారు.
నాకు ఏపీ ప్రభుత్వం ప్రోటోకాల్ ఇస్తుందని వేణుస్వామి కామెంట్లు చేశారు.నా దగ్గర చెక్ ఇన్ లగేజ్ ఉండదని నేను విమానశ్రయానికి 45 నిమిషాల ముందుగా వెళ్తానని ఆయన తెలిపారు.
ప్రతి హీరో, ప్రతి హీరోయిన్ ప్రోటోకాల్ ఫాలో అవుతారని వేణుస్వామి అన్నారు.
కరోనా విజృంభణ తర్వాత తమ పక్కన ఎవరూ కూర్చోకుండా సీట్లు బుకింగ్ చేసుకుంటున్నారని వేణుస్వామి తెలిపారు.2027 – 2028లో టాలీవుడ్ ప్రముఖ హీరో, హీరోయిన్ కు ప్రాణ గండం ఉందని ఆయన పేర్కొన్నారు.వాళ్లు యంగ్ అని ఆయన చెప్పుకొచ్చారు.
మంచి జ్యోతిష్కుడు దొరకడం కూడా జాతకమే అని వేణుస్వామి అన్నారు.చైసామ్ కలిసే ఛాన్స్ లేదని వేణుస్వామి పేర్కొన్నారు.
ప్రభాస్ గారి పరిస్థితి నెగిటివ్ గా ఉందని ఆయనకు ఆరోగ్య ఇబ్బందులు తీవ్రంగా ఉన్నాయని ఆయనకు అర్ధాష్టమ శని ప్రారంభం కానుందని వేణుస్వామి కామెంట్లు చేశారు.ప్రభాస్ సినిమాలు మరీ భారీ హిట్ కావని ఆయన కామెంట్లు చేశారు. రానా గురించి సమాజానికి తెలియక ముందే నేను చెప్పానని ఆయన చెప్పుకొచ్చారు.వైసీపీలో 25 మందికి టికెట్లు రావని వేణుస్వామి తెలిపారు.బండ్ల గణేష్ నాకు క్లోజ్ అని ఆయన కామెంట్లు అన్నారు.2024 ఎన్నికల్లో కేంద్రంలో హంగ్ రావచ్చని ఆయన పేర్కొన్నారు.