తెలంగాణలో రాజకీయాలు( Telangana Politics ) రసవత్తరంగా మారుతున్నాయి.నీటి ప్రాజెక్టుల వ్యవహారంలో అధికార కాంగ్రెస్,( Congress ) ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్( BRS ) మధ్య వార్ సాగుతోంది.
త్వరలో లోక్ సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ప్రాజెక్టుల పాలిటిక్స్ రాజుకుంటున్నాయి.మేడిగడ్డపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను తిప్పి కొట్టేందుకు బీఆర్ఎస్ చలో మేడిగడ్డకు( Chalo Medigadda ) పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
మరోవైపు బీఆర్ఎస్ కు కౌంటర్ ఇచ్చేందుకు కాంగ్రెస్ మరో అడుగు వేసింది.
ఈ మేరకు చలో పాలమూరు రంగారెడ్డికి( Chalo Palamuru Rangareddy ) పిలుపునిచ్చింది.రేపు కాంగ్రెస్ నేత వంశీ చంద్ రెడ్డి నేతృత్వంలో ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల నేతలు చలో పాలమూరు కార్యక్రమం చేపట్టనున్నారు.మరోవైపు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు( KCR ) వంశీచంద్ రెడ్డి లేఖ రాశారు.
దమ్ముంటే మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేయాలని సవాల్ విసిరారు.మహబూబ్ నగర్ కు న్యాయం చేయాలంటే సవాల్ స్వీకరించాలని డిమాండ్ చేశారు.