Mylavaram : మైలవరంలో పొలిటికల్ హీట్..!!

ఎన్టీఆర్ జిల్లా మైలవరం( Mylavaram )లో రాజకీయ వేడి రాజుకుంది.

నియోజకవర్గంలో రేపు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, మంత్రి జోగి రమేశ్ సభలు, సమావేశాలు జరగనున్నాయి.

ఈ మేరకు ఐతవరంలో మైలవరం నియోజకవర్గం సర్పంచ్ లు, కార్యకర్తలతో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కీలక సమావేశం నిర్వహించనున్నారు.

మరోవైపు మైలవరంలో వైసీపీ ఇంఛార్జ్ తిరుపతి రావు మరియు పార్టీ క్యాడర్ తో మంత్రి జోగి రమేశ్( Jogi Ramesh ) సమావేశం కానున్నారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సభకు వెళ్లేవారిపై వేటు వేసేందుకు పార్టీ అధిష్టానం సిద్ధం అయింది.ఇప్పటికే మైలవరం నియోజకవర్గంలోని ప్రాథమిక సహాకార సంఘాల ఛైర్మన్ల పదవీకాలం రెన్యువల్ ను వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిన సంగతి తెలిసిందే.

తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020
Advertisement

తాజా వార్తలు