ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల దర్యాప్తు..!

ఫోన్ ట్యాపింగ్ కేసు( phone tapping case )లో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇద్దరు అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నల కస్టడీ పూర్తయింది.

 Police Investigation In Phone Tapping Case..! , Phone Tapping Case Radhakisha-TeluguStop.com

భుజంగరావు, తిరుపతన్నలను ఐదు రోజులపాటు పోలీసులు విచారించారు.కస్టడీ పూర్తి కావడంతో వైద్య పరీక్షల నిమిత్తం భుజంగరావు, తిరుపతన్నను హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

వైద్య పరీక్షల అనంతరం వారిద్దరినీ నాంపల్లి కోర్టులో పోలీసులు హాజరుపరచనున్నారు.ఇదే కేసులో రాధాకిషన్ రావు( Radhakishan rao )ను పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు న్యాయస్థానాన్ని కోరారు.అదేవిధంగా ప్రణీత్ రావు బెయిల్ పిటిషన్ పై కూడా నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది.ఈ మేరకు టెలిగ్రాఫ్ యాక్ట్ నమోదు చేస్తూ నాంపల్లి కోర్టులో పోలీసులు మెమో దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో పోలీసులు దాఖలు చేసిన మెమోపై న్యాయస్థానం నిర్ణయం తెలపనుంది.కాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీస్ అధికారులు, రాజకీయ నేతల పేర్లు తెరపైకి వస్తున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube