తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో పోలీసులు విస్తృతంగా ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఈ మేరకు ఎన్నికల కోడ్ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో పోలీసులు సోదాలు చేపడుతున్నారు.ఈనెల 9 నుంచి ఇప్పటివరకు భారీగా నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు.తనిఖీల్లో భాగంగా రూ.5.1 కోట్ల నగదును పట్టుకున్న పోలీసులు రూ.4.2 కోట్ల విలువైన 7.706 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.అదేవిధంగా రూ.8.77 లక్షల విలువైన 11.700 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు.అలాగే 110 లీటర్ల మద్యం, 23 సెల్ ఫోన్లు, 43 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్ చేశారు.







