త్వరలో లోక్సభ ఎన్నికలు( Lok Sabha elections ) రానున్న నేపథ్యంలో బీజేపీ దూకుడు పెంచింది.ఎన్నికల షెడ్యూల్ కు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో కమలనాథులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
ఇందులో భాగంగా తెలంగాణ పర్యటనకు ప్రధాని మోదీ రానున్నారు.ఈ మేరకు వచ్చే నెల 4, 5వ తేదీల్లో మోదీ( PM Modi ) పర్యటించనున్నారు.మార్చి 4న ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్న మోదీ మార్చి 5న సంగారెడ్డిలో పర్యటించనున్నారు.అయితే తెలంగాణలో మెజార్టీ స్థానాలు గెలవాలని బీజేపీ ( BJP )భావిస్తున్న సంగతి తెలిసిందే.
మోదీ పర్యటన నేపథ్యంలో పార్టీ శ్రేణులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు.