జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీరు వీధి రౌడీలా ఉందని ఎంపీ నందిగం సురేశ్ మండిపడ్డారు.పవన్ రాజకీయ నాయకుడు కాదన్న ఆయన అసాంఘిక శక్తి అని విమర్శించారు.
ఏపీకి హానికరమైన వ్యక్తిగా పవన్ తయారు అయ్యాడని ఎంపీ నందిగం సురేశ్ ఆరోపించారు.పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వొద్దని వ్యతిరేకించడం ఏ క్లాస్ వార్ అని ప్రశ్నించారు.
పేద పిల్లలకు ఇంగ్లీష మీడియంను వ్యతరేకించడం ఏ క్లాస్ వార్ కిందకు వస్తుందో చెప్పాలన్నారు.సింగిల్ గా పోటీ చేస్తామని చెప్పే దమ్ము పవన్ కు ఉందా అని ప్రశ్నించారు.