వైసీపీ ఎమ్మెల్సీ సి.రామ చంద్రయ్య జనసేన పార్టీ అధినేత పవన్ పై సీరియస్ కామెంట్లు చేశారు.
త్వరలోనే పవన్.మళ్లీ టీడీపీతో కలుస్తున్నట్లు ఆరోపించారు.
వచ్చే ఎన్నికలలో చంద్రబాబుతో కలిసి పోటీ చేయడానికి.లోపాయికారి ఒప్పందం లో భాగంగా.
సీఎం జగన్ పై ఈ రీతిలో నోటికొచ్చినట్టు మాట్లాడితే రచ్చరచ్చ చేస్తున్నారని.స్పష్టం చేశారు.
జగన్ సీఎం కావడం పవన్ భరించలేక పోతున్నారని పేర్కొన్నారు.
సినిమా టికెట్ల వ్యవహారం లో పవన్ చేసిన వ్యాఖ్యలు ఆయన అజ్ఞానానికి నిదర్శనమని స్పష్టం చేశారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పవన్ ఒక న్యూసెన్స్ గా మారిపోయాడు అని… జనసేన పార్టీ స్థాపించిన.తర్వాత పెద్దగా సాధించింది ఏమీ లేదని, వామపక్షాలతో స్నేహం చేశారు ఆతర్వాత బీజేపీతో చేతులు కలిపారు.
అంతకుముందు పార్టీ స్థాపించిన ప్రారంభం లో.టీడీపీతో కలిసారు, తర్వాత వామపక్షాలతో కలిసి పోటీ చేశారు.రెండు చోట్ల ప్రజలు చిత్తుగా ఓడించారు.అనంతరం బీజేపీ లోకి పవన్ వెళ్ళిపోయారు.
అసలు ఆన్ లైన్ బుకింగ్ విధానం సినిమా ఇండస్ట్రీకి చెందిన పెద్దలే కోరడం జరిగిందని.ఈ క్రమంలో ప్రభుత్వం పారదర్శకమైన విధానాన్ని రూపొందిస్తున్నట్లు సి.రామచంద్రయ్య చెప్పుకొచ్చారు.ఈ విధానం తీసుకురావటం వల్ల బ్లాక్ మార్కెటింగ్ అరికట్టడం మాత్రమే కాక టికెట్ల రేట్లు ఇష్టం వచ్చిన రీతిలో పెంచే అవకాశం ఉండదని.
సామాన్యులకు ప్రభుత్వం మేలు చేసినట్లు అవుతుందని స్పష్టం చేశారు.మరి ఇన్ని.మేలులు సామాన్యులకు జరుగుతుంటే ఆన్ లైన్ బుకింగ్ విధానాన్ని.ఎందుకు పవన్ వ్యతిరేకిస్తున్నారు.? జగన్ పై ఎందుకు అంతగా విమర్శలు చేస్తున్నారు అంటూ ప్రశ్నించారు.సామాన్య ప్రేక్షకులకి మేలు చేస్తున్నాడు అనే అక్కసుతోనే జగన్ మీద పవన్ విమర్శలు చేస్తున్నారని సి.రామ చంద్రయ్య.సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.