జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెనాలి పర్యటన( Pawan Kalyan ) రద్దైంది.పవన్ కల్యాణ్ జ్వరంతో బాధపడుతున్న నేపథ్యంలో పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే షెడ్యూల్ ప్రకారం తెనాలిలో జనసేనాని పవన్ రోడ్ షో, బహిరంగ సభ నిర్వహించాల్సి ఉండగా ప్రస్తుతం పర్యటనను రద్దు చేసుకున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
అయితే పిఠాపురం నియోజకవర్గం( Pithapuram Assembly constituency )లో ఎండలో ప్రచారాన్ని నిర్వహించడంతో పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయ్యారని సమాచారం.ఈ క్రమంలోనే తెనాలి పర్యటన కొత్త షెడ్యూల్ త్వరలో ప్రకటిస్తామని జనసేన పార్టీ వెల్లడించింది.