ప్రజా సమస్యలపై చర్చలు జరగాల్సిన పార్లమెంటు యుద్ధ భూమిగా మారిందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆవేదన వ్యక్తం చేసారు.ప్రతి ఏడాది ఆగస్టు 15 సందర్భంగా రాష్ట్రపతి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం ఆనవాయితీ.
స్వతహాగా రాజకీయ నాయకుడైన ప్రణబ్ పార్లమెంట్ సమావేశాలు పూర్తిగా వాష్అవుట్ కావడం పై చాలా ఆవేదన చెందారు.దీంతో తన ప్రసంగంలో దాన్నే ప్రధానమైన అంశంగా పేర్కొన్నారు.
ప్రజాస్వామిక సంస్థలు ఈ విధంగా కావడం మంచిది కాదని, ఇది చాలా సీరియస్ గా ఆలోచించాల్సిన విషయమని అన్నారు.ప్రజాస్వామిక విలువలను కాపాడుకోవాలని అన్నారు.
ఇది ఒక్క రాష్ట్రపతి ఆవేదన మాత్రమె కాదు.దేశ ప్రజల అందరి ఆవేదన ఆయన తెలియచేసారు.
ఒక్క మంత్రిని (ప్రధానంగా) టార్గెట్ చేసుకొని కాంగ్రెస్ పార్లమెంటును జరగనీయకుండా చేయడం దారుణం.
.