సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం వచ్చింది.ఈ సమయం కోసమే కళ్ళు కాయలు కాచేలా రెండేళ్ల నుండి ఎదురు చేసారు ఫ్యాన్స్.
మరి ఆ సమయం వచ్చింది.మహేష్ బాబు హీరోగా మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో ప్రస్తుతం ‘సర్కారు వారి పాట‘ సినిమా తెరకెక్కిన విషయం విదితమే.
భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా నుండి నిన్న ఊర మాస్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది.
మహేష్ ను ఎలా చూడాలి అనుకుంటున్నారో అంత కన్నా డబల్ అందంగా, మాస్ హీరోలా చూపించి ప్రేక్షకులను ఖుషీ చేసాడు పరశురామ్.
ఈ ట్రైలర్ రిలీజ్ అయ్యి కొద్దీ సేపు మాత్రమే అవుతున్న భారీ రెస్పాన్స్ అందుకుంటుంది.మహేష్ తనలోని మాస్ ను మరోసారి బయటకు తీసాడు.
అందరు అంచనాల కన్నా కొద్దిగా ఎక్కువగానే ఈ ట్రైలర్ ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులను కూడా ఆకట్టు కోవడంతో ఈ ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ లభించింది.
ఈ సినిమా ఈ నెల 12న రిలీజ్ కానుంది.
.దీంతో 10 రోజులే రిలీజ్ కు టైం ఉండడంతో ఈ సినిమా ప్రొమోషన్స్ లో స్పీడ్ పెంచేసాడు.
ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా పరశురామ్ ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు.ఈయన ఈ సినిమా గురించి చెబుతూ.”ఈ సినిమాలో మహేష్ బాబు యాటిట్యూడ్ డిఫెరెంట్ గా ఉంటుందని.ఆయన క్యారెక్టర్ నచ్చడం వల్లనే వెంటనే ఈ సినిమాకు ఓకే చెప్పారని తెలిపాడు.

అలా మహేష్ కోసం కథ రెడీ చేశాను.ఈ సినిమా కథ పుట్టిందే మహేష్ బాబు కోసం.ఆయన డైలాగ్ డెలివరీ, డ్యాన్స్, ఫైట్స్ వేరే లెవల్ లో ఉంటాయి.ఈ కథను మహేష్ కాదంటే పక్కన పెట్టేసేవాడిని.ఎందుకంటే ఇది ఆయన చేస్తేనే బాగుంటుంది.థియేటర్స్ కి వచ్చిన ఫ్యాన్స్ కి ఈ సినిమా పండుగ చేస్తుంది అందంలో ఎలాంటి సందేహం లేదు అంటూ చెప్పుకొచ్చాడు.