ఆర్థిక సంక్షోభంతో పాకిస్తాన్ కఠిన నిర్ణయాలు తీసుకుంది.ఈ మేరకు ఎంపీలకు ఇచ్చే వేతనాల కోత నుంచి విదేశీ పర్యటనలు, లగ్జరీ వాహనాల కొనుగోలుపై నిషేధం విధించింది.
ఆర్థిక సమతుల్యతను కాపాడుకునేందుకు పాక్ అమెరికా సాయాన్ని అర్ధించింది.ఎన్నికలకు ముందు దేశ వ్యాప్తంగా నిత్యావసరాల ధరలు పెరుగుతాయన్న భయంతో ఐఎంఎఫ్ తో ఒప్పందాన్ని ఖరారు చేసుకోవడానికి పాక్ వెనుకడుగు వేస్తోన్నట్లు తెలుస్తోంది.
సైనిక, పౌర అధికారులకు కేటాయించిన ప్లాట్లను వెనక్కి తీసుకోనుంది.ప్రీపెయిడ్ విద్యుత్, గ్యాస్ మీటర్ల ఏర్పాటుతో పాటు నిఘా సంస్థలకు విచక్షణారహిత నిధుల కేటాయింపును నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది.
అదేవిధంగా అన్ని స్థాయిల్లో పెట్రోల్ వాడకం 30 శాతం తగ్గిస్తున్నట్లు వెల్లడించింది.